చెన్నై: ఏప్రిల్ 17
నుంచి ప్రారంభం కానున్న నడిగర్ సంగమ్ స్టార్ క్రికెట్ మ్యాచ్కు మెగాస్టార్
చిరంజీవి, బిగ్బీ అమితాబ్ బచ్చన్ హాజరుకానున్నారు. దక్షిణ
భారత ఫిల్మ్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ
కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికలను ఇప్పటికే వారికి పంపారు. మ్యాచ్
ప్రారంభోత్సవ కార్యక్రమానికి నటులిద్దరూ హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి.
కార్యక్రమానికి తమిళ సూపర్స్టార్ రజినీకాంత్, కమల్హాసన్
హాజరవనున్న విషయం తెలిసిందే.
ఈ టోర్నమెంట్లో
భాగంగా జరిగే ఆరు మ్యాచ్లలో(ఎనిమిది జట్లు)48 మంది నటులు పాల్గొననున్నారు. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో
ఏప్రిల్ 17న మ్యాచ్ ప్రారంభం
కానుంది.
No comments:
Post a Comment